Monday, April 13, 2015

సిద్ధమవుతున్న దగ్గుబాటి ‘మనం’

సిద్ధమవుతున్న దగ్గుబాటి ‘మనం’


దగ్గుబాటి కుటుంబ సభ్యులంతా ‘మనం’ సినిమా లాంటి ఓ ఫ్యామిలీ చిత్రం చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్, రానా, నాగచైతన్య కలిసి ఓ కుటుంబకథా చిత్రంగా ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతుందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను రానా నిజం చేసేసాడు. త్వరలోనే ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా తెలిసింది. వెంకటేష్, రానా, నాగ చైతన్యల కలయికలో రూపొందే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని, ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని రానా తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. రానా ప్రస్తుతం ‘బెంగళూర్ డేస్’ రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే నాగచైతన్య నటిస్తున్న ‘దోచేయ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ ముగ్గురు కలిసి నటించబోయే చిత్రం కమర్షియల్ మాస్, ఫ్యామిలీ యాక్షన్, కామెడీ, లవ్ ఎంటర్ టైనర్ గా వుండాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. ఇందులో ఈ ముగ్గురు హీరోలకు ముగ్గురు హీరోయిన్లు వుండబోతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టును సురేష్ బాబు తన సొంత ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మించనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

No comments:

Post a Comment