Tuesday, April 7, 2015

ముచ్చటగా మూడోసారి త్రిషకు...

ముచ్చటగా మూడోసారి త్రిషకు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , త్రిష జంటగా ‘తీన్ మార్’ చిత్రంలో చేసిన సంగతి తెలిసిందే. అలాగే ‘బంగారం’ చిత్రంలోనూ త్రిష అతిధి పాత్రలో నటించింది. తాజాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా పవన్ సినిమాలో త్రిషకు అవకాశం వచ్చిందని ఫిలింనగర్ సమాచారం. ఇది గబ్బర్ సింగ్ 2 కోసమా, లేక దాసరి నారాయణరావు, పవన్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసమా అనే విషయం మాత్రం తెలియలేదు. గబ్బర్ సింగ్ 2 సినిమా అన్ని సమస్యలని అధిగమించి సెట్స్ పైకి వచ్చిన తర్వాత దాసరి నారాయణరావు నిర్మించే సినిమా ప్రారంభం అవుతుంది. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్లుగా కొంతమంది పేర్లు ప్రచారంలోకి వచ్చినా, ఇప్పటి వరకూ ఎవర్ని ఎంపిక చేసినట్లు తెలియలేదు. మరి త్రిష విషయంలో కూడా సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే వరకు చెప్పలేని పరిస్థితి.

No comments:

Post a Comment