Friday, April 10, 2015

బన్నీ ఇమేజ్ కాస్త డ్యామేజ్



స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ మీడియాకు క్షమాపణలు చెప్పాడట. దీంతో భగ్గుమన్న మీడియా మిత్రులు కాస్త కూల్ అయ్యారు. ఇంతకీ ఈ హీరో సారీ చెప్పడానికి కారణాలేంటి..? అసలేం జరిగింది..? ఇదే సినీ లవర్స్‌ను వెంటాడుతున్న ప్రశ్నలు. ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే, 9న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈనెల 7న ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయాలని బన్నీ నిర్ణయించుకున్నాడు. దీంతో ఆయన పీఆర్‌ఓ మీడియా ప్రతినిధులు సమాచారం ఇవ్వడంతో మధ్యాహ్నం ఒంటిగంటకు అందరూ హాజరయ్యారు. ఐతే, అల్లుఅర్జున్ ఎంతకీ రాకపోవడంతో ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు రెండుగంటల తర్వాత మీడియా మిత్రులు ప్రకటించి అక్కడ నుండి వెనుదిరిగారు. ఈ క్రమంలో బన్నీ పీఆర్ఓ కొందరు రిపోర్టర్లలపై దురుసుగా మాట్లాడడంతో ఈ వ్యవహారం మరింత జఠిలమైంది. పరిస్థితి గమనించిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, బన్నీకి ఓ సలహా ఇచ్చాడట. తెల్లవారితే ‘ సన్నాఫ్ సత్యమూర్తి’ రిలీజ్ కాబోతోంది. ఇలాంటి సమయంలో వెనక్కి తగ్గడం మంచిదని సలహా ఇవ్వడంతో 8న ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి క్షమాపణలు చెప్పినట్టు సమాచారం. దీంతో సన్నాఫ్ సత్యమూర్తి’ నిర్మాత కాస్త హ్యాపీగా ఫీలయ్యాడట. లేకపోతే ఈ ఎఫెక్ట్ తన సినిమాపై ఎక్కడ పడుతుందోనని ఒకానొకదశలో ఆందోళన చెందినట్టు సమాచారం. మరోవైపు అల్లుఅర్జున్ వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో ఒకటే కామెంట్స్ పడిపోతున్నాయి. ఫిల్మ్ ఇండస్ర్టీలో ఇలా ఎవరూ వ్యవహరించలేదంటూ సైటైర్లు పడిపోతున్నాయి. మొత్తానికి బన్నీ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యిందనే చెప్పవచ్చు.

No comments:

Post a Comment