Monday, April 13, 2015

సిద్ధమవుతున్న దగ్గుబాటి ‘మనం’

సిద్ధమవుతున్న దగ్గుబాటి ‘మనం’


దగ్గుబాటి కుటుంబ సభ్యులంతా ‘మనం’ సినిమా లాంటి ఓ ఫ్యామిలీ చిత్రం చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్, రానా, నాగచైతన్య కలిసి ఓ కుటుంబకథా చిత్రంగా ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతుందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను రానా నిజం చేసేసాడు. త్వరలోనే ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా తెలిసింది. వెంకటేష్, రానా, నాగ చైతన్యల కలయికలో రూపొందే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని, ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని రానా తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. రానా ప్రస్తుతం ‘బెంగళూర్ డేస్’ రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే నాగచైతన్య నటిస్తున్న ‘దోచేయ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ ముగ్గురు కలిసి నటించబోయే చిత్రం కమర్షియల్ మాస్, ఫ్యామిలీ యాక్షన్, కామెడీ, లవ్ ఎంటర్ టైనర్ గా వుండాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. ఇందులో ఈ ముగ్గురు హీరోలకు ముగ్గురు హీరోయిన్లు వుండబోతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టును సురేష్ బాబు తన సొంత ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మించనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

Saturday, April 11, 2015

కరివేపాకు కదా అని తీసి పారేయకండి. ఉపయోగాలు ఎన్నో…

కరివేపాకు కదా అని తీసి పారేయకండి. ఉపయోగాలు ఎన్నో…

రక్తహీనత, మధుమేహం, జీర్ణసంబంధమైన సమస్యలను నివారించడంలో కరివేపాకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇందులో విటమిన్-ఎ, ఫోలిక్ యాసిడ్, కాల్షియం పుష్కలంగా ఉన్నందున వంటల్లో దీన్ని విరివిగా వాడుతుండాలి. కరివేపాకులోని విటమిన్-ఎ వల్ల దృష్టి సంబంధ లోపాలను (కాటరాక్ట్) అధిగమించవచ్చు. ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఉన్నందున రక్తహీనత తగ్గుముఖం పడుతుంది. జీర్ణశక్తిని కూడా ఇది పెంపొందిస్తుంది. మధుమేహాన్ని తగ్గించే గుణం ఉన్నందున బ్లడ్ సుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు బాక్టీరియాను నివారించే అంశాలున్నందున కరివేపాకును వాడితే చర్మసంబంధ ఇన్‌ఫెక్షన్లకు దూరం కావొచ్చు. జట్టు రాలడం, తెల్లబడడం వంటి సమస్యలను అధిగమించేందుకు కరివేపాకును విరివిగా వాడాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Friday, April 10, 2015

బన్నీ ఇమేజ్ కాస్త డ్యామేజ్



స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ మీడియాకు క్షమాపణలు చెప్పాడట. దీంతో భగ్గుమన్న మీడియా మిత్రులు కాస్త కూల్ అయ్యారు. ఇంతకీ ఈ హీరో సారీ చెప్పడానికి కారణాలేంటి..? అసలేం జరిగింది..? ఇదే సినీ లవర్స్‌ను వెంటాడుతున్న ప్రశ్నలు. ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే, 9న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈనెల 7న ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయాలని బన్నీ నిర్ణయించుకున్నాడు. దీంతో ఆయన పీఆర్‌ఓ మీడియా ప్రతినిధులు సమాచారం ఇవ్వడంతో మధ్యాహ్నం ఒంటిగంటకు అందరూ హాజరయ్యారు. ఐతే, అల్లుఅర్జున్ ఎంతకీ రాకపోవడంతో ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు రెండుగంటల తర్వాత మీడియా మిత్రులు ప్రకటించి అక్కడ నుండి వెనుదిరిగారు. ఈ క్రమంలో బన్నీ పీఆర్ఓ కొందరు రిపోర్టర్లలపై దురుసుగా మాట్లాడడంతో ఈ వ్యవహారం మరింత జఠిలమైంది. పరిస్థితి గమనించిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, బన్నీకి ఓ సలహా ఇచ్చాడట. తెల్లవారితే ‘ సన్నాఫ్ సత్యమూర్తి’ రిలీజ్ కాబోతోంది. ఇలాంటి సమయంలో వెనక్కి తగ్గడం మంచిదని సలహా ఇవ్వడంతో 8న ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి క్షమాపణలు చెప్పినట్టు సమాచారం. దీంతో సన్నాఫ్ సత్యమూర్తి’ నిర్మాత కాస్త హ్యాపీగా ఫీలయ్యాడట. లేకపోతే ఈ ఎఫెక్ట్ తన సినిమాపై ఎక్కడ పడుతుందోనని ఒకానొకదశలో ఆందోళన చెందినట్టు సమాచారం. మరోవైపు అల్లుఅర్జున్ వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో ఒకటే కామెంట్స్ పడిపోతున్నాయి. ఫిల్మ్ ఇండస్ర్టీలో ఇలా ఎవరూ వ్యవహరించలేదంటూ సైటైర్లు పడిపోతున్నాయి. మొత్తానికి బన్నీ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యిందనే చెప్పవచ్చు.

s/o సత్యమూర్తి'...పాజిటివ్ టాక్ వినిపిస్తోంది

'
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన 's/o సత్యమూర్తి' సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సినిమా విడుదల కావడంతో ఉత్కంఠకు తెరపడింది. సినిమాపై ముందు నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. బెనిఫిట్ షోలు, మార్నింగ్ షోలో చూసిన ప్రేక్షకుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం......సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ మరోసారి తన సత్తా చూపించాడు. ముఖ్యంగా సినిమాలోని డైలాగులు అదుర్స్ అంటున్నారు. ఇక సినిమాకు హైలెట్ క్లైమాక్స్ అని అంటున్నారు. అయితే సరైన ప్లేసింగ్ లేని సాంగులు సినిమా ఫ్లోను తగ్గించాయని అంటున్నారు. కానీ పాటల చిత్రీకరణ మాత్రం అద్భుతంగా ఉందని అంటున్నారు. సినిమా కథ చాలా బావుందనే అభిప్రాయం ఫ్యామిలీ ప్రేక్షకుల నుండి వినిపిస్తోంది. అయితే బన్నీని ఇప్పటి వరకు ఎనర్జిటిక్ గా చూసిన ప్రేక్షకులకు ఇందులోని స్లో స్క్రీన్ ప్లే అతనికి సెట్ కాలేదనే భావన కలుగింది. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా, డాన్సుల పరంగా బన్నీ అదరగొట్టాడు. దేవిశ్రీ తన సంగీతం ప్రేక్షకులను సంతృప్తి పరిచాడు.

రాజుకు ఏడేళ్ల శిక్ష

సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈఓ రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందికి ప్రత్యేక కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి గురువారం 971 పేజీల తీర్పు వెలువరించారు. రామలింగరాజుకు రూ. 5.74 కోట్లు, రామరాజుకు రూ. 5 కోట్ల 73 లక్షల 75 వేలు జరిమానా విధించారు. మిగతా నిందితులందరికీ కలిపి రూ. 13.84 కోట్లు జరిమానాగా విధించారు. వివిధ నేరాలకు వేర్వేరుగా శిక్షలు విధించినా వాటిని ఏకకాలంలో అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. దీని ప్రకారం దోషులంతా గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా చెల్లించకపోతే మరికొన్ని నెలలు అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే విచారణ ఖైదీలుగా జైలులో ఉన్న కాలాన్ని మినహాయించి (సీఆర్పీసీ సెక్షన్ 428 కింద) మిగతా శిక్షా కాలాన్ని మాత్రమే దోషులు అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు ప్రతులను దోషులకు అందజేశారు. దీనిపై పైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని, అవసరమైతే లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయసహాయం పొందవచ్చని వారికి సూచించారు. విచారణలో సహకరించిన సీబీఐ స్పెషల్ పీపీ, నిందితుల తరఫు న్యాయవాదులు, ఇతర కోర్టు సిబ్బందికి న్యాయమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.

Thursday, April 9, 2015

ప్రేమ చాలా మధురం’ అంటారు:త్రిష

ప్రేమ చాలా మధురం’ అంటారు:త్రిష

‘ప్రేమ లేదనీ....ప్రేమించరాదనీ ’’ అని మహాకవి ఆత్రేయ ‘అభినందన’ చిత్రంలో ప్రేమ గురించి తనదైన శైలిలో రాశారు. మళ్లీ అదే సినిమాలో ‘‘ప్రేమ ఎంత మధురం...ప్రియురాలు అంత కఠినం’’ అన్నారు. ఇలా ప్రేమ గురించి మంచీ, చెడూ ఏది చెప్పినా వినడానికి మాత్రం హాయిగా ఉంటుంది. ప్రేమకు ఉన్న మహత్తు అలాంటిది. అసలు ఈ ప్రపంచంలో ప్రేమ గురించి మాట్లాడనివాళ్లు ఎవరూ ఉండరేమో! ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో రకంగా విశ్లేషిస్తారు. పెళ్లిలో ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్న త్రిష మాత్రం... ‘ప్రేమ చాలా మధురం’ అంటారు. ప్రేమ గురించి ట్విట్టర్‌లో త్రిష స్పందిస్తూ -‘‘ప్రేమలో అసూయ, ద్వేషం, విషాదం, ఒంటరితనం, ఎడబాటు, సంతోషం - అన్నీ ఉంటాయి. ఈ బంధంలో ఉన్నప్పుడు బాధ, సంతోషం ఏదైనాసరే దానికి కారణం ప్రేమే అని చాలామంది అనుకుంటారు. అది పొరపాటు. ప్రేమ ఎప్పుడూ బాధపెట్టదు. వాస్తవానికి ప్రేమ ఎన్నడూ ఎవర్నీ బాధపెట్టదు. మనసుకైన గాయాలు మానడానికి ప్రేమ కన్నా మించిన మంచి మందు లేదు. ఈ ప్రపంచంలో ఉన్న బాధలన్నింటినీ పోగొట్టే శక్తి ప్రేమకు ఉంది. బాధ నుంచి బయటపడేసి మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చే అద్భుతమైన ఆయుధం ప్రేమ’’ అన్నారు.

చంద్రబాబు..మహానాడు

మహానాడును టార్గెట్ చేసుకుని నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఆ లోపు జిల్లాలో ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులను పార్టీకోసం పనిచేసే కీలకమైన నాయకులు, కార్యకర్తలతో భర్తీ చేయాలని భావిస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా మంత్రులు, నియోజకవర్గ ఎమ్మెల్యేలను నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. మొన్నటి వరకు తరువాత చూద్దామన్న ఆలోచనతో ఉన్న ప్రజాప్రతినిధులు ఇప్పుడు సమాలోచనలు చేస్తున్నారు. జిల్లాలో 2014 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంపూర్ణ విజయం సాధించింది. వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం నామినేటెడ్ పదవులన్నీ రద్దుచేసింది. అప్పటి నుండి ఒక్కొక్కటిగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసుకుంటూ వస్తోంది. వీటిలో ముఖ్యమైనవి మార్కెట్ యార్డులు. జిల్లాలో కేవలం కొన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు మాత్రమే నూతన కార్యవర్గాలను ఏర్పాటుచేశారు. ఇంకా చాలావరకు మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను ఏర్పాటుచేయాల్సి ఉంది. అయితే పార్టీ నేతలు, ఎమ్మెల్యేల మధ్య భేదాభిప్రాయాలు ఉండటంతో వాటి భర్తీకి వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే ఇంచుమించుగా ఎమ్మెల్యే స్థాయి పదవి. ఒక విధంగా షాడో ఎమ్మెల్యేగా మార్కెట్ యార్డు చైర్మన్‌ని పిలుస్తారు. ఇలా నియోజకవర్గాల్లో చాలావరకు మార్కెట్ యార్డులతో పాటు చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఎమ్మెల్యేలు ముందుకు రావడం లేదు. ఇక మే 27, 28, 29 తేదీల్లో విజయవాడలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనుంది. ఇప్పటికే పార్టీ ఆ పనుల్లో నిమగ్నమై ఉంది. మరోపక్క సంస్థాగత ఎన్నికలను కూడా పూర్తిచేసుకోనుంది. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేసినట్టైతే ఒక విధంగా మహానాడును విజయవంతం చేసినట్టే. తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చిన జిల్లాలో పార్టీ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం కారణంగా నామినేటెడ్ 

Wednesday, April 8, 2015

వీరు కత్తి ఎప్పుడు దూస్తారో....

వీరు కత్తి ఎప్పుడు దూస్తారో....
ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు మంచి ఊపందుకున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్ లో మల్టీస్టారర్స్ సినిమాలు కామన్. ఎంత పెద్ద హీరోలు అయినా ఏమాత్రం ఇగోలకు స్థానం ఇవ్వకుండా నటిస్తారు. మరి తెలుగు సినిమాలో కూడా మల్టీస్టారర్స్ సినిమాలు చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ ఎవరి ఇమేజ్ వారిదే.. కానీ ఈ మధ్య కాలంలో ఇగోలు అన్నీ పక్కకు పెట్టి ఈ టైప్ ఆఫ్ సినిమాలకు ఎక్కువ ప్రియార్టీ ఇస్తున్నారు. మొన్నామధ్య వచ్చిన గోపాల గోపాల ఎంతటి ఘనవిజయం సాధించిందో వేరే చెప్పనక్కరలేదు. తాజాగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన కత్తి సినిమా కోలీవుడ్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. విజయ్ , మోహన్ లాల్ కలసి నటించిన ఈ సినిమాని తెలుగులోనూ రిమేక్ చేస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఠాగూర్ మధు ఈ సినిమా రీమేక్ హక్కులని దక్కించుకున్నారు. నేటి సమాజంలో జరగుతున్న అన్యాయాలు, అక్రమాలపై, బడుగు బలహీనవర్గాలు , రాజకీయాల నేపధ్యంలో రూపొందిన సినిమా ఇది. మరి తెలుగులో అంత పవర్ ఫుల్ కాంబినేషన్ ఏదా అని అలోచిస్తే గోపాల గోపాల లో ఇద్దరు హీరోల్లో పవన్ కళ్యాన్, టెంపర్ సినిమాతో దుమ్ము లేపిన ఎన్టీఆర్ కరెక్ట్ అని అనిపించందట. ఇక్కడి వరకు బాగుంది కానీ ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం బిజీ షెడ్యూల్లో ఉన్నారు. పవన్, ఎన్టీఆర్ లకు ఈ సినిమా తెగ నచ్చిందట. అందులో పాత్రలు కూడా బాగా నచ్చాయట. ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 కోసం , దాసరి సినిమాకోసం సిద్దంగా ఉన్నాడు. మరి వీరీ కత్తి ఎప్పుడు దూస్తారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

153 లొకేషన్లలో 'సన్నాఫ్ సత్యమూర్తి'


అల్లు అర్జున్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంపై ప్రేక్షకులు, మెగా అభిమానులలో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ప్రతి ఏరియాలో భారి ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యు.ఎస్.ఏ.లో ఫస్ట్ డే మొత్తం 153 లొకేషన్లలో 'సన్నాఫ్ సత్యమూర్తి' విడుదలవుతుంది. ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయిన థియేటర్ల సంఖ్య ఇది. రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఓవర్సీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో 'సన్నాఫ్ సత్యమూర్తి' రికార్డు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో దర్శకుడు త్రివిక్రమ్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది చిత్రాలు కాసుల కనక వర్షం కురిపించాయి. 'సన్నాఫ్ సత్యమూర్తి' ఎంత వసూలు చేస్తుందో..? అని అంతా ఎదురుచూస్తున్నారు. అమెరికాలో అత్యధిక లొకేషన్లలో(159) విడుదలైన చిత్రంగా మహేష్ 'ఆగడు' రికార్డు నెలకొల్పింది. ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు కూడా 'ఆగడు'పై ఉంది. వీటిని 'సన్నాఫ్ సత్యమూర్తి' బ్రేక్ చేస్తుందో..? లేదో..? చూడాలి.

ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథతో పరేష్ రావల్ చిత్రం


ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథతో బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. విలక్షణ నటడు పరేష్ రావల్ మోదీ పాత్రలో కనిపించనున్నారు. ఆ సినిమా ఆగస్టులో సెట్స్పైకి వెళ్లనుంది. ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పరేష్ రావల్ ఈ విషయం తెలిపారు.''మోదీ సంకల్ప బలం, దార్శనికత, నాయకత్వ లక్షణాలను నా పాత్రలో ప్రతిబింబిస్తా. అంతే తప్ప మోదీని ఏ మాత్రం అనుకరించే ప్రయత్నం చేయను'' అని చెప్పారు పరేష్. గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్గా పరేష్ ఓ సినిమాలో కనిపించారు.ప్రస్తుతం ఎంపీగా ఉన్న పరేష్ పార్లమెంటు అనుభవం గురించీ మాట్లాడారు. ''సభలో జరిగే చర్చలు నాకు ఎంతో ఉపకరిస్తున్నాయి. వాటి వల్ల ఓ పౌరుడిగానే కాక నటుడిగానూ నన్ను నేను మెరుగుపర్చుకోగలుగుతున్నాను'' అని చెప్పారు పరేష్ రావల్.
NaN

Tuesday, April 7, 2015

ముచ్చటగా మూడోసారి త్రిషకు...

ముచ్చటగా మూడోసారి త్రిషకు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , త్రిష జంటగా ‘తీన్ మార్’ చిత్రంలో చేసిన సంగతి తెలిసిందే. అలాగే ‘బంగారం’ చిత్రంలోనూ త్రిష అతిధి పాత్రలో నటించింది. తాజాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా పవన్ సినిమాలో త్రిషకు అవకాశం వచ్చిందని ఫిలింనగర్ సమాచారం. ఇది గబ్బర్ సింగ్ 2 కోసమా, లేక దాసరి నారాయణరావు, పవన్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసమా అనే విషయం మాత్రం తెలియలేదు. గబ్బర్ సింగ్ 2 సినిమా అన్ని సమస్యలని అధిగమించి సెట్స్ పైకి వచ్చిన తర్వాత దాసరి నారాయణరావు నిర్మించే సినిమా ప్రారంభం అవుతుంది. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్లుగా కొంతమంది పేర్లు ప్రచారంలోకి వచ్చినా, ఇప్పటి వరకూ ఎవర్ని ఎంపిక చేసినట్లు తెలియలేదు. మరి త్రిష విషయంలో కూడా సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే వరకు చెప్పలేని పరిస్థితి.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు.ఎంత సంపాదించినా ఆరోగ్యం సహకరించకుంటే అదంతా వేస్టే. ఆరోగ్యానికున్న ప్రాధాన్యత అలాంటిది. ఇవాళ ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం...1948 ఏప్రిల్ ఏడో తేదిన మొదటిసారి ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని WHO నిర్వహించారు. అయితే 1950 నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ రోజున వరల్డ్ హెల్త్ సమావేశాన్ని జరుపుతున్నారు. ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు, రక్షిత మంచినీటి సప్లయ్, అత్యవసర సమయాల్లో ఆరోగ్యకరమైన అంశాలపై సమన్వయం, వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపునిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సంస్థ అనారోగ్యానికి దారి తీసే ప్రధాన అంశం మీద పరిశోధించి అంతర్జాతీయ, దేశీయ, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలలో నిర్ణీత ప్రాంతాలలో ఏఫ్రిల్ 7వ తేదీన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతి రోజు నిద్ర లేచినదగ్గర నుంచి ఉరుకులు పరుగులమయంతో కూడుకున్న ఈ జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక నేటి ప్రజలకు కొరవడింది. ఆకలేస్తుంది కదా అని ఏది పడితే అది తినేస్తున్నారా? ధర తక్కువని, లేక ఎక్కువ ఆహారం, ఎక్కువ వెరైటీలు వచ్చేస్తున్నాయని నాన్ స్టాప్ గా లాగించేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. కలుషిత ఆహారం కాటేసే ప్రమాదం ఉంది. అవును నాణ్యత లేని ఆహారం ప్రపంచాన్నే పట్టి పీడిస్తుంది. కలుషిత ఆహారం ఏటా 20 లక్షల మంది ప్రాణాలను హరిస్తోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నిజం. అందుకే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సురక్షిత ఆహారానికి 5 సూచనలు చేసింది. ఏప్రిల్ 7వ తేదీ అంటే ఈరోజే. ఈరోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అదే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్నిఒక్కో థీమ్ తో జరుపుకుంటారు. 1948 నుంచి ఈ దినోత్సవం రోజున ఏటా ఓ నినాదాన్ని ఎంపిక చేసుకుని ఆయా రోగాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇలా తొలిసారి అంటు వ్యాధులు అన్న అంశాన్ని నినాదంగా తీసుకోగా, 1972లో అనేక మంది చిన్నారులు టీబీతో మృతి చెందగా, ఆ ఏడాది టీబీకి వ్యతిరేకంగా అవగాహన శిబిరాలు ఏర్పాటు చేశారు . 2011లోఅధిక మందుల వాడకం- కలిగే అనర్ధాలు అన్న అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని విస్తృత ప్రచారం కల్పించగా, 2012లో ఏజింగ్ హెల్త్ – గుడ్ హెల్త్ యాడ్స్ లైఫ్ టు ఇయర్స్ ను థీంగా తీసుకుంది. 2014లో వెక్టర్ బోన్ డిజీస్ నినాదం తీసుకుంది. ఈసారి ప్రమ్ ఫామ్ టు ప్లేట్, మేక్ పుడ్ సేఫ్. వ్యవసాయ క్షేత్రం నుంచి ప్లేట్ లోకి సురక్షిత ఆహార తయారి అనే ఈ రెండు అంశాలు ఈ సారి ప్రధానాంశాలు. కలుషిత ఆహారం తినడం వల్లే అనేక వ్యాధుల బారిన పడడం కాకుండా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. వాతావరణంలో వస్తున్న మార్పులు సైతం మనం తినే ఆహార పదార్థాలపై ప్రభావం చూపుతాయి. ;వినియోగ పద్దతులు కూడా మారుతున్నాయి. గ్లోబలైజేషన్ అవుతున్న నేటికాలంలో పరిశుభ్రమైన ఆహారం కూడా ఎంతో ముఖ్యం. అందుకే సురక్షితమైన ఆహార వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. రైతులు లేదా ఆహార ఉత్పత్తి దారులు వీటిని వినియోగించే వారు ఎలాంటి సూచనలు తీసుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ;కీలక సూచనలు చేసింది.
 

Monday, April 6, 2015

పోరాటమే కాదు........రొమాన్స్ కూడా

పోరాటమే కాదు........రొమాన్స్ కూడా
మోస్ట్ ఎవైటెడ్ మూవీ రుద్రమదేవి సినిమాకు సంబంధించి దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. రుద్రమదేవి పోరాట గాథ మాత్రమే కాదని...ఇదొక ప్రేమ కథా చిత్రం అని కూడా ఆయన వెల్లడించారు. తెలుగు జాతి గర్వించేలా, కాకతీయుల వైభవాన్ని కళ్లకు కట్టేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. రుద్రమదేవి సినిమా గురించి కన్ ఫ్యూజన్ అవసరం లేదని ఆయన అన్నారు. రుద్రమదేవి పూర్తిగా పోరాట చిత్రం కాదని... అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తగినంత రొమాన్స్ కూడా ఉంటుందని గుణశేఖర్ చెప్పారు. ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు గుణశేఖర్ తెలిపారు. రీ రికార్డింగ్ పనుల్లో ఇళయరాజా లండన్ లో బిజీగా ఉన్నారని , రెండు వారాల్లో పూర్తి కావచ్చన్నారు. సినిమా విడుదల తేదీని నిర్ణయించలేదని..మేలో ప్రేక్షకుల ముందుకు రావచ్చని చెప్పారు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో వస్తున్న రుద్రమదేవి చిత్రంలో ప్రధాన పాత్రలో అనుష్క, మరో ముఖ్య పాత్రలో రానా , గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ అలరించనున్నారు. ప్రకాష్ రాజ్, కృష్టంరాజు,సుమన్, నిత్యమీనన్, కేథరీన్ తదితర భారీ తారాగణం నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. వేసవిలో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

‘మా’ నటీనటులార ఆదరించండి



ఇంతకీ ఆ నటుడు ఎవరంటారా? అతను 70 వ దశకంలోనే చెన్నై రైలు ఎక్కి చేతకాదు అనుకున్న దానిని ప్రయత్నం చేసి ఆనాటి దర్శకుల సహాయంతో తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమలలో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రెండున్నర అడుగుల కళాకారుడు. అతనెవరో ఇప్పటికే దాదాపు మీకర్ధం అయివుంటుంది. అతనే మన పొట్టి వీరయ్య మరగుజ్జు తనం శాపంగా బావించి భయంతో భాధతో బ్రతుకుతున్న ఆ రోజులలోనే ధైర్యం చేసి అతని ఆకారాన్ని అవకాశంగా వాడుకోవాలని సూర్యాపేట నుండి చెన్నై రైలు ఎక్కి సినీ అవకాశాలు సంపాదించి సినీ అభిమానుల మనసులలో ముద్ర వేసుకున్నాడు. ఆరోజుల్లో విటాలాచార్య, దాసరి నారాయణరావు వంటి తదితర దర్శకులు వీరయ్య కోసం పాత్రలు సృష్టించి అవకాశాలు కల్పించి ప్రోత్సహించారు. తరువాత తరువాత ఫిలిం ఇండస్ట్రీ హైదరబాద్ షిఫ్ట్ అయ్యాక తాను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు కాని తరువాత తరం దర్శకులు మాత్రం వీరయ్యకి కోసం పెద్దగా అవకాశాలు కల్పించలేదు. రోజులు గడుస్తున్న కొద్ది పొట్ట గడుపుకోవటం కష్టం అయ్యింది. దిక్కు తోచని స్దితిలో కృష్ణ నగర్ లో కాయిన్ బాక్స్ డబ్బా పెట్టుకొని కాలం వెళ్ళదీస్తూ వచ్చాడు. అయితే టెక్నాలజీ పెరిగి అందరి చేతుల్లోకి సెల్ పోన్ లు వచ్చిన తరువాత కాయిన్ ఫోన్ కాలం చెల్లింది. పాపం వీరయ్యకి ఆ ఆదాయం కూడా లేకుండా పొయింది. అడపాదడపా చిన్న చితక వేషాలు నెలకో రెండు నెలలకో ఓ రోజు పడితే అదే మహాభాగ్యం. అందులో జీవితం దుర్బరంగా ఉంది. అయినా వీరయ్య ఎప్పుడు లైమ్ లైట్ లోనే ఉంటాడు ఎలా అంటారా? మీడియా, సినీరాజకీయ నాయకులు పేద కళాకారుడు అన్న పేరు చెప్పాలంటే చాలు ముందు వీరయ్య గురించే చెప్తారు. ఓ సినీయర్ సెటిల్ అయిన నటుడు ఓ పేద కలాకారుడితో ఫోటో దిగి రాజకీయం చేయాలంటే వీరయ్య కన్పిస్తాడు ఏంటో వాళ్ళ స్వార్ధానికి తన పేదరికాన్ని ఉపయోగించుకునే ఈ సినీరాజకీయ పండితులు తనకి నాలుగు అవకాశాలు కల్పించటానికి కాని ఏదైనా ఆర్ధిక సహాయం చేయటానికి కాని ముందుకు రారు. ఏ సంత్సరానికో రెండు సంత్సరాలకో ఎవరైనా దాత వచ్చి ఓ ఐదు వేలో పదివేలో ఇస్తే అవి ఎన్ని రోజులు సరిపోతాయి. దర్శక నిర్మతలారా...! ‘మా’ నటీనటులార ఒక్కసారి మీతోటి నటుడి గురించి ఆలోచించండి ఆదరించండి.

ట్విట్టర్ లో 40 లక్షలమంది అనుసరిస్తున్నారు

ట్విట్టర్ లో 40 లక్షలమంది అనుసరిస్తున్నారు

ప్రముఖ బాలీవుడ్ భామ అలియాభట్ కు ఫిదా అయిపోయేవాళ్లు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఆమె అభిమానుల సంఖ్య 40 లక్షలు దాటేసింది. 22 ఏళ్ల ఈ చిన్నది స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం ద్వారా ఒక్కసారిగా యువ హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ అమ్మడు షాందార్, ఉథా పంజాబ్, కపూర్ అండ్ సన్స్ అనే చిత్రాల ద్వారా వెంటవెంటనే తన అభిమానులను పలకరించబోతోంది. అయితే, సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ లో ఆమెను ఫాలో అయ్యేవారు దాదాపుగా 4.19 మిలియన్లకు చేరడంతో తెగ మురిసిపోతోంది అలియా భట్. అభిమానులారా మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. సినిమాలు, పాటలు, జోకుల ద్వారా ఎలా వీలయితే అలా మీ అందరిని అలరింపజేస్తానని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను' అంటూ వాగ్దానం చేసింది.

బాబా గా మారిన చంద్రమోహన్


సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇన్నాళ్లుగా భక్తుడి వేషాలు వేశారు. ఇప్పుడు తాజాగా బాబాగా నటిస్తున్నారు. విభిన్నమైన పాత్రలో ఆయన నటిస్తున్న చిత్రం ‘మూర్ఖుడు’. సృజన ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై సత్యం ముప్పిడి దర్శకత్వంలో డా.సి.వి.రత్నకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పతాక సన్నివేశాలతో చిత్రీకరణ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్యం ముప్పిడి మాట్లాడుతూ ‘చంద్రమోహన్, ధన్‌రాజ్‌లపై చిత్రీకరించిన క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రానికి హైలెట్‌గా ఉంటాయి. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఆటోబయోగ్రఫీ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో చంద్రమోహన్ బాబాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కెమెరా పనితనం హైలెట్‌గా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో చంద్రమోహన్ పాత్ర ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని, బాబాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారని, చంద్రమోహన్, ధన్‌రాజ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుపుతున్నామని నిర్మాత డా.సి.వి.రత్నకుమార్ తెలిపారు. త్వరలో ఆడియో విడుదలచేసి, వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, అనేకమంది కథలతో చిత్రాలను రూపొందించిన రామ్‌గోపాల్‌వర్మ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని ఆయన అన్నారు. తన యాభయ్యేళ్ల సినీ కెరీర్‌లో తొలిసారిగా బాబాగా నటిస్తున్న ఈ చిత్రం అందర్నీ ఆలోచింపచేస్తుందని నటుడు చంద్రమోహన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి నిర్మాత: డా.సి.వి.రత్నకుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్యం ముప్పిడి.

ధోని కూతురు జీవా బయటకు వచ్చింది

ధోని కూతురు జీవా బయటకు వచ్చింది
ఎట్టకేలకు టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కూతురు జీవా బయటకు వచ్చింది. పుట్టిన తర్వాత ఈ చిన్నారి ఫోటో చూడాలని అభిమానులు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతీరోజూ సోషల్ మీడియాలో వెతుకుతూనే వున్నారు. తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సాముండా అంతర్జాతీయ విమానాశ్రయంలో ధోనీ దంపతులతో చిన్నారి కనిపించగానే ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. వెంటనే నాలుగైదు ఫోటోలు తీశారు. ఒక్కదానిలో జీవా క్లియర్‌గా కనిపించినా అప్పటికే నిద్రపోతోంది. కూతురు ముఖం బయటకు కనపడనీయకుండా మహేంద్రుడు చాలా జాగ్ర్తతలు తీసుకున్నాడు.for more details visit www.thetelugunews.com

Sunday, April 5, 2015

సూర్యాస్'మాస్' లో ప్రణీత


నటి ప్రణీత ఏదో ఒక వివాదంతో వార్తల్లో కెక్కే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో రీ ఎంట్రీ అయిన ఈ భామ ఇంతకుముందు కార్తీ సరసన శకుని చిత్రంలో నటించారు. ఆ చిత్రం ప్లాప్ అవడంతో ప్రణీత మూటాముల్లు సర్దుకుని టాలీవుడ్‌లో మకాం పెట్టారు. అక్కడ అత్తారింటికి దారేది చిత్రం ఆమెకు విజయాన్నిందించింది. ఆ చిత్ర దర్శకుడు తదుపరి చిత్రంలో కూడా అవకాశం ఇచ్చినా దీన్ని కాలదన్నుకున్నారు. అలాంటి సమయంలో తమిళంలో ఎమిజాక్సన్ వదులుకున్న సూర్య సరసన నటించే అవకాశం ప్రణీతకు వరించింది. ఆ చిత్రం పేరు మాస్. ఇందులో ప్రధాన హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు. కాగా చాలామంది హీరోయిన్లు విమాన ప్రయాణాల్లో బిజినెస్‌క్లాస్ టికెట్ కావాలి, షూటింగ్ స్పాట్‌లో క్యారవాన్ వ్యాన్ సౌకర్యాలు కావాలని డిమాండ్ చేస్తుంటారు. అయితే తను అలాంటి డిమాండ్లు చేయనంటున్నారు నటి ప్రణీత. ఇటీవల షూటింగ్ ముగించుకుని హైదరాబాదు నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఈ బ్యూటీ విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్‌తో కాకుండా ఎకానమీ టికెట్‌తో ప్రయాణం చేశారట. దీని గురించి ఆమె తెలుపుతూ విమానంలో పయనించడానికి బిజినెస్ క్లాస్ టికెట్టే కావాలని డిమాండ్ చేసే నటిని కానన్నారు. సూపర్‌స్టార్ మమ్ముట్టి, రాహుల్ ద్రావిడ్ లాంటి ప్రముఖులు కూడా ఎకానమీ టికెట్‌తోనే ప్రయాణం చేయడం చూశానన్నారు. అలాంటి ప్రయాణాల్లో అభిమానుల్ని కలుసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. తాను ఎక్కువగా ఎకానమీ టికెట్‌తోనే పయనిస్తున్నానన్నారు. ఇలాంటి విషయాల్లో తానెప్పుడూ సంకటపడిన సందర్భాలు లేవన్నారు. అలాంటి విషయాల్లో బందా చూపే హీరోయిన్లంటే అసహ్యం అని ప్రణీత పేర్కొన్నారు.